Ahmedabad Tragedy: బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 8 మంది మృతి
బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానమంత్రి మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటన. Ahmedabad Tragedy: గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామోల్-గట్రాడ్ రోడ్డులో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికు

బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానమంత్రి మోదీ ఎక్స్గ్రేషియా ప్రకటన. Ahmedabad Tragedy: గుజరాత్లోని అహ్మదాబాద్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రామోల్-గట్రాడ్ రోడ్డులో ఉన్న ఒక బాణసంచా కర్మాగారంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ(Ahmedabad Tragedy) భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ప్రమాద శబ్దం దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 72nd National Awards: 72వ జాతీయ పురస్కారాలు.. బెస్ట్ స్క్రీన్ ప్లే ‘సుకుమార్’.. సత్తా చాటిన ‘కమిటీ కుర్రాళ్లు’, డైరెక్టర్ ‘వెంకీ అంట్లూరి’ రంగంలోకి రాపిడ్ యాక్షన్ ఫోర్స్: వస్త్రాల్లోని రాపిడ్ యాక్షన్ ఫోర్స్ శిబిరం వెనుకాలే ఈ ఫ్యాక్టరీ ఉండటంతో, ప్రమాదం జరిగిన వెంటనే ఆర్ఏఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రాకముందే వారు రంగంలోకి దిగి శిథిలాల కింద ఉన్నవారిని రక్షించారు. అనంతరం ఐదు ఫైర్ టెండర్లతో వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గాయపడిన వారిలో నలుగురిని ఎల్జీ ఆస్పత్రికి, మరో ముగ్గురిని అసర్వా సివిల్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అనుమతులు లేని ఫ్యాక్టరీ: అధికారుల ప్రాథమిక దర్యాప్తులో ఈ బాణసంచా కర్మాగారానికి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని తేలింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతుండటం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేల చొప్పున పీఎంఎన్ఆర్ఎఫ్ నుండి ఎక్స్గ్రేషియా ప్రకటించారు.