Dhimsa Guinness Record: 13 వేల మందితో ‘థింసా నృత్యం’.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. భోగాపురం ఎయిర్పోర్ట్ వద్ద అద్భుతం
థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు 13 వేల మంది ప్రదర్శన మంత్రికి సర్టిఫికెట్ అందజేసిన ప్రతినిధులు Dhimsa Guinness Record: ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి నిదర్శనమైన గిరిజన సాంప్రదాయ నృత్యం ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. మన్యం ప్రాంతాలకే సొంతమైన విశిష్ట కళారూపం ప్రపంచ రికార్డును సొంతం చ

థింసా నృత్యానికి గిన్నిస్ రికార్డు 13 వేల మంది ప్రదర్శన మంత్రికి సర్టిఫికెట్ అందజేసిన ప్రతినిధులు Dhimsa Guinness Record: ఉత్తరాంధ్ర సాంస్కృతిక వైభవానికి నిదర్శనమైన గిరిజన సాంప్రదాయ నృత్యం ప్రపంచ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. మన్యం ప్రాంతాలకే సొంతమైన విశిష్ట కళారూపం ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని తెలుగోరి ఖ్యాతిని నలుదిశలా చాటిచెప్పింది. ఏపీ విజిట్, సాంస్కృతిక వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఈ అద్భుత ఘట్టం స్థానికులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. Telangana Sir Survey: తెలంగాణ ఓటర్లకు బిగ్ అలర్ట్.. SIR సవరణ గడువు పొడిగింపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం వద్ద దాదాపు 13 వేల మంది గిరిజన బాలికలు ఏకకాలంలో చేసిన ‘థింసా’ నృత్యం అద్భుతమైన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్(Dhimsa Guinness Record)ను కైవసం చేసుకుంది. ఈ అపురూప ప్రదర్శనను గిన్నిస్ బుక్ ప్రతినిధులు నేరుగా పర్యవేక్షించి, సంబంధిత రికార్డు పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణికి వైభవంగా అందజేశారు. ఆగస్టు 1న జరిగే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సిద్ధం చేసిన ఈ ప్రదర్శన ఉత్తరాంధ్ర సంస్కృతి, సాంప్రదాయాల గొప్పతనాన్ని గ్లోబల్ లెవెల్లో సగర్వంగా నిలబెట్టింది.