IND vs ENG : తొలి వన్డేలో ఘోరంగా విఫలమైన రో-కో.. గంభీర్కు ఛాన్స్ ఇస్తున్నారుగా?
IND vs ENG : ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఘోరంగా విఫలం అయ్యారు. 259 పరుగుల లక్ష్య ఛేదనలో సీనియర్ ఆటగాళ్లుగా వీరు జట్టును విజయతీరాలకు చేరుస్తారని, చాన్నాళ్ల తరువాత వీరిద్దరి విన్యాసాలను మైదానంలో వీక్షించాలని భావించిన అభిమానులకు

IND vs ENG : ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఘోరంగా విఫలం అయ్యారు. 259 పరుగుల లక్ష్య ఛేదనలో సీనియర్ ఆటగాళ్లుగా వీరు జట్టును విజయతీరాలకు చేరుస్తారని, చాన్నాళ్ల తరువాత వీరిద్దరి విన్యాసాలను మైదానంలో వీక్షించాలని భావించిన అభిమానులకు గట్టి షాక్ తగిలింది. 21 బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ ఓ ఫోర్ కొట్టి 11 పరుగులు మాత్రమే చేసి సామ్ కరన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకోవడంతో తొలి వికెట్గా పెవిలియన్కు చేరుకున్నాడు. ఇక వన్డౌన్లో వచ్చిన కోహ్లీ పైన భారీ ఆశలే పెట్టుకున్నారు ఫ్యాన్స్. హిట్ మ్యాన్ తొందరగానే పెవిలియన్కు చేరడంతో.. తనకు అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో మరోసారి యాంకర్ పాత్ర పోషిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడుతాడని అనుకున్నారు. అయితే.. 6 బంతులు మాత్రమే ఆడిన కోహ్లీ ఓ ఫోర్ కొట్టి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్కు చేరుకున్నాడు. దీంతో భారత్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. Ryan ten Doeschate : ఇంగ్లాండ్ సిరీస్ తరువాత.. భారత అసిస్టెంట్ కోచ్ పదవికి డస్కటే రాజీనామా! ఇంగ్లాండ్ గడ్డపై సీనియర్లు అయిన కోహ్లీ, రోహిత్లు తమ ఆటతీరుతో జూనియర్లకు మార్గదర్శకులుగా మారుతారని ఆశించిన ఫ్యాన్స్కు తొలి వన్డేలో నిరాశే ఎదురైంది. ఇక మిగిలిన రెండు వన్డేల్లోనైనా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గంభీర్కు ఛాన్సు ఇస్తున్నారుగా? 37 ఏళ్ల రోహిత్ శర్మకు, 37 ఏళ్ల కోహ్లీకి ఈ వన్డే సిరీస్ అత్యంత కీలకం అన్న సంగతి తెలిసిందే. టెస్టులు, టీ20లకు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన వీరిద్దరు.. వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాలంటే ప్రతి మ్యాచ్లోనూ రాణిస్తూ తమ స్థానాలను నిలుపుకోవాల్సిన స్థితిలో ఉన్నారు. ఓవైపు జట్టులోకి వచ్చేందుకు జూనియర్ ఆటగాళ్లు వేచిచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రదర్శనలు చేస్తే జట్టులో చోటు కోల్పోవడం ఖాయం. Jasprit Bumrah : చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. ఇంగ్లాండ్ గడ్డపై ఏకైక భారత బౌలర్ సీనియర్ ఆటగాళ్ల కంటే జూనియర్ ఆటగాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గంభీర్కు రో-కోలు ఇలా ఆడితే ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్లో రో-కోలు ఆడాలంటే ఇంగ్లాండ్ సిరీస్లో రాణించడం చాలా కీలకం. కాబట్టి మిగిలిన రెండు వన్డేల్లో వీరిద్దరు భారీ ఇన్నింగ్స్లు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.