Medico Priyanka Case : మెడికో ప్రియాంక కేసులో కొత్త కోణం.. కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..
Medico Priyanka Case : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. హత్యాయత్నం అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. నిందితులపై హత్

Medico Priyanka Case : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంక కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియాంకది హిట్ అండ్ రన్ కాదు.. హత్యాయత్నం అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశామని అన్నారు. Also Read : China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పంట పండించి కోత కోసిన చైనా.. చంద్రుడు, అంగారకుడిపై వ్యవసాయానికి తొలి అడుగు.. ఆగస్టు 3న ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తుంది. ఆ సమయంలో మద్యం మత్తులో నిందితులు కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు. అయితే, వారు అంతకుముందు మాల్లో సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారు. వారిపై దాడిచేసి అక్కడి నుంచి పారియే క్రమంలో కారును వేగంగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టడం జరిగిందని, అయితే, నిందితులు కారుతో మూడుసార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీల్లో గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఈనెల 3న రాత్రి 10గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి ప్రమాదంపై సమాచారం రావడంతో అదే రోజు రాత్రి వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని, నిందితులు మద్యం సేవించి డ్రైవ్ చేసినట్లు ఆధారాలు సేకరించామని, కల్పబుల్ మర్డర్ అటెంప్ట్ సెక్షన్ 110 కింద నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. అవసరమైతే పరిస్థితులను బట్టి మరింత కఠిన సెక్షన్లు జత చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసులో ఎక్కడా రాజకీయ ఒత్తిళ్లు లేవన్న ఎస్పీ.. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని రేపు పటిషన్ వేస్తామని.. ఉద్దేశపూర్వకంగా చేశారా? లేదా అనేదానిపై విచారణ చేస్తామని తెలిపారు. అయితే, నిందితులపై గతంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. మరోవైపు నిందితులకు కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు మార్చాలి.. తన కుమార్తెకు ఈ గతి పట్టించిన వారికి చట్టప్రకారం తగిన శిక్షలు పడాల్సిందేనని ప్రియాంక తండ్రి వెంకటేశ్ డిమాండ్ చేశారు. అయితే, జరిగిన విషయాన్ని పోలీసులు ప్రియాంక తండ్రి వెంకటేశ్ కు వివరించినట్లు ఎస్పీ తెలిపారు. మరోవైపు.. సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉన్న ప్రియాంక ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం కుదుటపడలేదని తెలుస్తోంది.