Narendra Modi AP: ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన.. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రాజెక్టులు ఇవే
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలు తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల శంకుస్థాపన Narendra Modi AP: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు భారీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో ప్రాం
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ వేడుకలు తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల శంకుస్థాపన Narendra Modi AP: ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు భారీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ పర్యటనలో ప్రాంతీయ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా, రాష్ట్ర పారిశ్రామిక, ఇంధన రంగాలకు సరికొత్త ఊపునిచ్చే అనేక కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో భాగంగా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు, రూ. 820 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అనంతపురం, కర్నూలు సౌర విద్యుత్ జోన్ల ఇంధన తరలింపు ట్రాన్స్మిషన్ పథకాలను ఆయన జాతికి అంకితం చేశారు. Also Read: భోగాపురం విమానాశ్రయ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. వేదికపై ఆసక్తికర సన్నివేశం.. ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా విశాఖపట్నం తుర్లవాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ – టెస్టింగ్ యూనిట్కు ప్రధాని శంకుస్థాపన చేశారు. కొరియా రిపబ్లిక్కు చెందిన ఏపీఏసీటీ భాగస్వామ్యంతో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న ఈ ప్లాంట్, ఆంధ్రప్రదేశ్లోనే తొలి సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా సుమారు 96 మిలియన్ల సెమీకండక్టర్ చిప్లు తయారవ్వడమే కాకుండా, రాష్ట్రంలోని యువతకు అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగావకాశాలు విస్తృతంగా లభించనున్నాయి. మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్ప్రెస్వే, తాడిపత్రి బైపాస్ రహదారులను మోదీ ప్రారంభించారు. అలాగే కర్నూలు-IV రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుతో పాటు ఎన్హెచ్-565 లోని పెంచలకోన-ఏర్పేడు మధ్య లింగ సముద్రం వద్ద నిర్మించనున్న హైలెవెల్ వంతెన పనులకు ప్రధాని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రవాణాను సులభతరం చేయడంతో పాటు ప్రాంతీయ అనుసంధానాన్ని గణనీయంగా పెంచనున్నాయి.