Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నాలుగు రోజులు వర్షాలు పడతాయి అలర్ట్లతో జాగ్రత్తలు వహించండి Rain Alert: పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు క

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నాలుగు రోజులు వర్షాలు పడతాయి అలర్ట్లతో జాగ్రత్తలు వహించండి Rain Alert: పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, రాబోయే 3 నుండి 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. Vemulawada Donation Issue: వేములవాడ ఆలయంలో వింత ఘటన.. స్వామివారికి 7 లక్షల విరాళం.. వెనక్కివ్వండని వేడుకున్న కుమార్తెలు తెలంగాణ వాతావరణం & జిల్లాల వారీ హెచ్చరికలు తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు(Rain Alert) పడనున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. అలాగే రాజధాని హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాల్లో గంటల వ్యవధిలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి & తీర ప్రాంత అప్రమత్తత: ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే 3 నుంచి 4 రోజులు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కాకినాడ, పశ్చిమ గోదావరి, బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది. సముద్రం అలజడిగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు.