Revanth Reddy: నేరుగా ఎదుర్కొనే దమ్ములేదు.. అందుకే ఈ కుట్రలు.. బీజేపీ-బీఆర్ఎస్ లపై సీఎం రేవంత్ ఫైర్!
రేవంత్రెడ్డిపై ప్రతిపక్షాల ఉమ్మడి కుట్ర కాంగ్రెస్ ఓట్ల తొలగింపు యత్నం ఓటరు నమోదుపై రేవంత్ ఆదేశం Revanth Reddy: తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి తట్టుకోలేకనే భాజపా, బీఆర్ఎస్ పార్టీలు తనపై కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రస

రేవంత్రెడ్డిపై ప్రతిపక్షాల ఉమ్మడి కుట్ర కాంగ్రెస్ ఓట్ల తొలగింపు యత్నం ఓటరు నమోదుపై రేవంత్ ఆదేశం Revanth Reddy: తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను చూసి తట్టుకోలేకనే భాజపా, బీఆర్ఎస్ పార్టీలు తనపై కుట్రలు పన్నుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరైనా, తమ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడమే వారి ఏకైక లక్ష్యమని మండిపడ్డారు. ఓటరు జాబితా సమగ్ర సవరణపై కొడంగల్లో నిర్వహించిన బిఎల్ఏ (BLA)ల సమావేశంలో ఆయన మాట్లాడారు. Agreed List System: అవినీతి అధికారులపై ఉక్కుపాదం.. అమలులోకి ‘అగ్రీడ్ లిస్ట్’ వ్యవస్థ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పేదలకు మంచి చేసేందుకు రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నామని, అయితే కొడంగల్లో నేరుగా ఎదుర్కోలేక కాంగ్రెస్కు ఓటు వేసే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని సీఎం తెలిపారు. కొడంగల్లో తనను రాజకీయాత్మకంగా దెబ్బతీస్తే రాష్ట్రస్థాయిలో నిలువరించవచ్చని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆయన విమర్శించారు. నియోజకవర్గంలో ఇప్పటికే 78 శాతం ఓట్ల నమోదు పూర్తయిందని, మిగిలిన 22 శాతం అర్హులైన వారిని కూడా వెంటనే నమోదు చేయించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందవని, ప్రతి ఒక్కరూ సరైన ఆధారాలతో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి కొడంగల్లో 100 శాతం ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియను పూర్తి చేయాలని, తనపై కుట్రలు పన్నుతున్న వారికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.