Schools Closed : విద్యార్థులకు అలర్ట్.. ఈనెల 24న స్కూళ్లు, కాలేజీలు బంద్.. కారణం ఇదే..
Schools Closed : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీతోపాటు..

Schools Closed : విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఈనెల 24వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ పార్టీతోపాటు.. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీలో పెద్దెత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోనూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. Also Read : Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రదాన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఏం చదివారు? ఆయనకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి? నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు రోడ్లపైకి వచ్చి డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యా సంఘాల ఐక్య వేదిక నిర్ణయించింది. ఈ క్రమంలో SFI, AISF, NSUI, PSDU, AIFDS సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి. ఇందులో భాగంగా జులై 24వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించాయి. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యార్థి నాయకులు టి.నాగరాజు, కె.మణికంఠ రెడ్డి, వెంకట్ స్వామి తదితరులు బంద్ వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీరువల్ల విద్యార్థుల జీవితాలు నాశనమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మేధావులు ఈనెల 24వ తేదీన చేపట్టే బంద్కు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని వారు కోరారు. బంద్ రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.