DA hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుపై అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది
కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు. దీపావళి కానుకగా వచ్చే అవకాశం. పెరగనున్న జీతాలు, పెన్షన్ల మొత్తాలు. DA hike: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ (DA hike) పెంపు వార్త కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ప్రతి ఏటా అమల్లోకి వచ్చే జూలై నెల డీఏ సవరణ ప్రకటన కో

కేంద్ర ఉద్యోగుల డీఏ పెంపు. దీపావళి కానుకగా వచ్చే అవకాశం. పెరగనున్న జీతాలు, పెన్షన్ల మొత్తాలు. DA hike: దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ (DA hike) పెంపు వార్త కోసం ఎంతగానో నిరీక్షిస్తున్నారు. ప్రతి ఏటా అమల్లోకి వచ్చే జూలై నెల డీఏ సవరణ ప్రకటన కోసం ఉద్యోగ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం నిపుణుల అంచనాల ప్రకారం.. కేంద్ర ఉద్యోగుల డీఏ మరో 3 శాతం మేర పెరిగి, ప్రస్తుతం ఉన్న 60 శాతం నుండి 63 శాతానికి చేరుకునే బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. Iran-US War: శాంతి ఒప్పందాన్ని పక్కన పెట్టేసిన ఇరాన్.. క్షిపణులతో భారీ దాడులు.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత ఏఐసీపీఐ సూచీ ఆధారంగా లెక్కింపు: మార్చి నుంచి మే నెల వరకు విడుదలైన ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల్లో నిరంతర పెరుగుదల నమోదు కావడమే ఈ పెంపునకు ప్రధాన ప్రాతిపదికగా నిలిచింది. జూన్ నెల తుది నివేదిక అనంతరం దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ జూలైలో అధికారిక ప్రకటన ఆలస్యమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం తన పాత ఆనవాయితీ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో దీపావళి పండుగ కానుకగా ఈ బంపర్ ఆఫర్ను ప్రకటించే వీలుంది. కోటి మందికి పైగా లబ్ధి: ఈ నిర్ణయం వల్ల రక్షణ, రైల్వే వంటి కీలక రంగాల ఉద్యోగులతో పాటు సుమారు 50 లక్షల మంది సిబ్బంది, 65 లక్షల మంది పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. డీఏ పెంపుతో నెలవారీ జీతాలే కాకుండా గ్రాట్యుటీ, పీఎఫ్, పెన్షన్ మొత్తాలు కూడా భారీగా పెరుగుతాయి. దీనికి తోడు, 8వ వేతన సంఘం ఏర్పాటుపై సైతం సన్నాహాలు మొదలయ్యాయి. ఈ కమిషన్ నివేదిక 2027 నాటికి సిద్ధమైనా, ఉద్యోగులకు దీని పూర్తి ప్రయోజనాలు అందేసరికి 2029 లేదా 2030 వరకు సమయం పట్టవచ్చని తెలుస్తోంది.