ప్రధాని మోదీ ఇంటి వద్ద రాహుల్ ధర్నా భగ్నం..
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రధాని మోదీ నివాసం వద్ద నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాం

ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రధాని మోదీ నివాసం వద్ద నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలను తీసుకుని వెళ్లి బస్సులో వేరేచోటకు తరలించారు. దీంతో సుమారు మూడు గంటల పాటు ప్రధాని నివాసం వద్ద కొనసాగిన కాంగ్రెస్ పార్టీ ధర్నా ముగిసింది. కాంగ్రెస్ పార్టీ ఆందోళనపై స్పందించారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్లను తాము చర్చించేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సడన్ గా ధర్నాకు దిగిందని ఆరోపించారు. తాను ప్రభుత్వం తరఫున వారితో మాట్లాడేందుకు వెళితే రాహుల్ గాంధీ గడికో మాట మాట్లాడారని విమర్శించారు. తాము సభలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ధర్నాను విరమించాల్సిందిగా కోరామన్నారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం తాము ధర్నాను కొనసాగిస్తామని.. కావాలంటే భగ్నం చేసుకోవచ్చని చెప్పడాన్ని తప్పు పట్టారు. ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్నారు. రాహుల్ గాంధీ ధర్నాను భగ్నం చేస్తున్న పోలీసులు (Image:ANI) సీజేపీ ఆందోళనలతో పాటు మరికొన్ని అంశాలపై పార్లమెంట్ లో చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. లోక్ సభ, రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాయి. ఈ క్రమంలో ఉభయసభలు పలుమార్లు వాయిదాలు పడుతూ రేపటికి వాయిదా పడ్డాయి. అనంతరం కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నాకు దిగింది. రాహుల్ నేతృత్వంలో పార్టీ లీడర్లు ప్రధాని మోదీ నివాసం వద్ద ధర్నాకు దిగారు. ప్రతిపక్షాల ధర్నాతో ప్రభుత్వం స్పందించింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాహుల్ గాంధీతో మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐదు ప్రధాన డిమాండ్లను జితేంద్ర సింగ్ ఎదుట ఉంచింది. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి పార్లమెంట్ వేదికగా హోంమంత్రి ప్రకటన చేయాలి నీట్ అంశంపై పార్లమెంట్ లో చర్చను చేపట్టాలి విద్యార్థుల సమస్యలను వినాలి సీజేపీ ధర్నా సందర్భంగా జరిగిన హింసపై విచారణ జరపాలి రాహుల్ గాంధీతో మాట్లాడిన అనంతరం జితేంద్ర సింగ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొద్దిసేపటికి కాంగ్రెస్ పార్టీ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. లీడర్లను ఎత్తుకుంటూ వెళ్లి బస్సులో ఎక్కించారు.