నీట్ పేపర్ లీక్ నిరసనల వేళ.. ప్రధాని మోదీ సీరియస్ వార్నింగ్..
PM Modi Fast Track Courts : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ మొదలు పెట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార

PM Modi Fast Track Courts : నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ మొదలు పెట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీసైతం పేపర్ లీకేజీ ఘటనపై ఆందోళనలు ఉధృతం చేయడంతోపాటు విద్యార్థులుసైతం రోడ్డెక్కడంతో ఢిల్లీ వీధులు ఆందోళనలతో అట్టుడికాయి. కాంగ్రెస్, విద్యార్థి సంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా నీట్ పేపర్ లీకేజీ ఘటనపై స్పందించారు. Also Read – JP Nadda : నీట్ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధం.. రాహుల్ గాంధీ ఆరోపణలపై విచారణ జరిపిస్తాం ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉదయం ఎక్స్ వేదికగా కీలక ప్రకటన చేశారు. పరీక్ష పత్రాల లీకేజీ బాధ్యులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. యువత భవిష్యత్తుకు హాని చేయాలని చూసేవారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మోదీ వెల్లడించారు. ఇటీవల పేపర్ లీక్ ఆరోపణలపై దేశవ్యాప్తంగా విద్యార్థి నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అయితే, పేపర్ లీకేజీ అంశంపై కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం.. నీట్ నిరసనకారులను శాంతింపజేస్తుందా? అనేది చూడాలి. Nothing is more important than the welfare and future of our youth! We have decided to set up fast-track courts to ensure swift and stringent punishment for those involved in paper leaks. Have directed the concerned authorities and officials to take all necessary steps in this… — Narendra Modi (@narendramodi) July 23, 2026 మోదీకి ట్వీట్కు రాహుల్, సీజేపీ కౌంటర్.. ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ పై రాహుల్ గాంధీ స్పందించారు. యువత భవిష్యత్తును నాశనం చేసింది మీరే అంటూ విమర్శించారు. పేపర్ లీకులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలి.. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అంతేకాదు.. పేపర్ లీకులపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ పై స్పందించింది. పేపర్ లీకుల వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని స్పష్టం చేసింది. అలాగే విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని, అప్పటి దాకా తమ పోరాటం ఆగబోదని సీజేపీ స్పష్టం చేసింది.