Ktr: డబ్బులు చెల్లిస్తే నష్టపోతారు.. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పాలసీ రద్దు.. కేటీఆర్ మాస్ వార్నింగ్
హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం భూమాఫియా ఉచ్చులో పడొద్దు నీటి హక్కులపై మళ్లీ ఉద్యమం Ktr: హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు క

హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం భూమాఫియా ఉచ్చులో పడొద్దు నీటి హక్కులపై మళ్లీ ఉద్యమం Ktr: హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(Ktr) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ విధానం పేరుతో సుమారు 10 వేల ఎకరాల విలువైన భూములను దారాదత్తం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. సెప్టెంబర్లో ఈ పాలసీపై పారిశ్రామిక అసోసియేషన్లతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, పారిశ్రామికవేత్తలందరికీ లేఖలు రాస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, ఈ పాలసీ కింద ఎవరైనా భూమాఫియాతో చేతులు కలిపి డబ్బులు చెల్లిస్తే తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ హెచ్చరించారు. Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం.. అధికారిక ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ! కాంగ్రెస్ క్షుద్ర రాజకీయాలు, రైతులు, వ్యవసాయంపై నిర్లక్ష్యం: మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్ నేతలు చేస్తోన్న విమర్శలు, వరుణ యాగాలపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్లా దైవకార్యాలు, యాగాలు ఎవరూ చేయలేదని, దైవకృపతో పాటు మానవ ప్రయత్నం ఉంటేనే ఫలితం ఉంటుందని హితవు పలికారు. హరీశ్రావు ఆలయానికి వెళ్తే క్షుద్ర పూజలంటూ కాంగ్రెస్ నాయకులు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయం, రైతుల సంక్షేమంపై కనీస అవగాహన లేదని, పాలమూరు బిడ్డగా చెప్పుకుంటూనే ఆ జిల్లాకు సాగునీరు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఎక్కడా జరగడం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ నీటి హక్కుల కొల్లగొట్టుడు, హైడ్రాపై కేటీఆర్ ఆగ్రహం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ద్వారా తెలంగాణ నీటిని కొల్లగొడుతున్నా ప్రస్తుత ప్రభుత్వం మౌనంగా ఉండిపోతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బోర్డు సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ నీటి హక్కుల సాధన కోసం మళ్లీ ఉద్యమ స్థాయి పోరాటం చేస్తామని ప్రకటించారు. అలాగే ‘హైడ్రా’ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ వారి కడుపు కొడుతోందని, అధికారం ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.