Tirupati-Karimnagar Express: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. కరీంనగర్-తిరుపతి రైలు సమయాల్లో మార్పు.. పూర్తి డీటెయిల్స్ ఇవే
మారిన తిరుపతి ఎక్స్ప్రెస్ సమయాలు అక్టోబర్ పది నుండి అమలు ప్రయాణికులు మార్పులు గమనించగలరు Tirupati-Karimnagar Express: తెలంగాణ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని అందించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మా

మారిన తిరుపతి ఎక్స్ప్రెస్ సమయాలు అక్టోబర్ పది నుండి అమలు ప్రయాణికులు మార్పులు గమనించగలరు Tirupati-Karimnagar Express: తెలంగాణ ప్రాంతం నుండి తిరుపతికి వెళ్లే వేలాది మంది భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సమాచారాన్ని అందించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి, వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చడానికి రైల్వేశాఖ నిరంతరం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా కరీంనగర్-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే కీలక రైలు సర్వీస్ సమయాల్లో మార్పులు చేస్తూ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. Cm Chandrababu: 90 ఏళ్ల అవ్వ జీవితకాల కోరిక.. నేరుగా వచ్చి కల్సిన సీఎం చంద్రబాబు అక్టోబర్ 10 నుండి కొత్త టైమింగ్స్ అమలు: ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తిరుపతి-కరీంనగర్ (12761) ఎక్స్ప్రెస్ (Tirupati-Karimnagar Express)టైమింగ్స్ను సవరించారు. కొత్త వేళల ప్రకారం ఈ రైలు రాత్రి 8:05 గంటలకు కాకుండా 19:50 గంటలకే (రాత్రి 7:50) తిరుపతిలో బయల్దేరుతుంది. ఆ తర్వాత రేణిగుంటకు 20:15 గంటలకు, శ్రీకాళహస్తికి 20:39 గంటలకు చేరుకుంటుంది. ఈ మారిన సమయాలు అక్టోబర్ 10వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించింది. ప్రధాన స్టేషన్లలో నిలుపుదల, భక్తులకు తీవ్ర లబ్ధి: ఈ రైలు ఆదివారం రాత్రి తిరుపతిలో బయల్దేరి సోమవారానికి కరీంనగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం సాయంత్రం కరీంనగర్లో బయల్దేరి మంగళవారం ఉదయానికి తిరుపతి చేరుకుంటుంది. ఈ సర్వీస్ పెద్దపల్లి, జమికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గూడూరు మీదుగా ప్రయాణిస్తుంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల భక్తులకు శ్రీవారి దర్శనార్థం వెళ్లడానికి ఈ రైలు సమయాల మార్పు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.