UPI MDR Charges : గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం యూజర్లకు బిగ్ అలర్ట్.. UPI ఇక పూర్తిగా ఫ్రీ కాదు..? ఈ లావాదేవీలపై ఛార్జీలు పడతాయి!
యూపీఐ వాడేవారికి అలర్ట్.. ఇక ఉచితం కాదు.. ఎవరు చెల్లించాలి? యూపీఐ పేమెంట్లకు బ్రేక్.. ఛార్జీలు పడతాయి జాగ్రత్త యూపీఐపై ఛార్జీలకు కేంద్రం రంగం సిద్ధం కొత్త ఛార్జీలపై కేంద్రం కీలక ఆలోచన UPI MDR Charges : యూపీఐ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇకపై యూపీఐ ఫ్రీ కాదు.. ఇలాంటి లావాదేవీలపై భారీగా ఛార్జీలు కట్

యూపీఐ వాడేవారికి అలర్ట్.. ఇక ఉచితం కాదు.. ఎవరు చెల్లించాలి? యూపీఐ పేమెంట్లకు బ్రేక్.. ఛార్జీలు పడతాయి జాగ్రత్త యూపీఐపై ఛార్జీలకు కేంద్రం రంగం సిద్ధం కొత్త ఛార్జీలపై కేంద్రం కీలక ఆలోచన UPI MDR Charges : యూపీఐ యూజర్లకు బిగ్ షాకింగ్ న్యూస్.. ఇకపై యూపీఐ ఫ్రీ కాదు.. ఇలాంటి లావాదేవీలపై భారీగా ఛార్జీలు కట్టాల్సిందే.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు విధించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. యూపీఐ వాడే అందరి యూజర్లకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయా? అంటే కాదనే చెప్పాలి.. అంటే.. యూపీఐ చిన్న (UPI MDR Charges) లావాదేవీలు చేసే యూజర్లకు ఎలాంటి ఛార్జీలు ఉండకపోవచ్చు.. కేవలం ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేసే యూజర్లకు మాత్రమే ఛార్జీలు వర్తించనున్నట్టు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో లావాదేవీలు చేసే యూపీఐ వినియోగదారులకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) లేదా మర్చంట్ ఫీజు విధించే అంశంపై కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదన సాధారణ యూజర్ల కోసం కాదని తెలుస్తోంది. వార్షిక టర్నోవర్ రూ.40 లక్షలకు పైబడిన మర్చంట్స్, ఈ-కామర్స్ కంపెనీల నుంచి మాత్రమే మర్చంట్ ఫీజు వసూలు చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. Read Also : Airtel Postpaid Plan : ఎయిర్టెల్ యూజర్లకు భారీ షాక్.. రూ.549 ప్లాన్ ఇక లేదు.. కొత్త రీచార్జ్ ఎంతంటే? సాధారణంగా ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ ద్వారా పేమెంట్లు చేసే యూజర్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫ్రీ సర్వీసులు అలాగే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి ప్రతిపాదన ప్రస్తుతానికి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఆమోదం పొందిన తర్వాత ఫైనల్ డిసిషెన్ అమల్లోకి రానుంది. ప్రతిపాదనల ప్రకారం.. రూ.40 లక్షలకుపైగా వార్షిక టర్నోవర్ పొందే మర్చంట్లపై 5 పాయింట్ల నుంచి 7 బేసిస్ పాయింట్ల వరకు ఎండీఆర్ విధించే అవకాశముంది. కొన్ని లావాదేవీలపై సుమారు రూ.5 నుంచి రూ.7 వరకు మర్చంట్ ఫీజు ఉండొచ్చని రిపోర్టులు సూచిస్తున్నాయి. జనవరి 2020 నుంచి యూపీఐ లావాదేవీలపై జీరో ఎండీఆర్ అమల్లో ఉంది. తద్వారా యూపీఐ యాప్స్కు నేరుగా ఆదాయం లేదు. కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు, నిర్వహణ ఖర్చులకు సరిపోవడం లేదని ఇండస్ట్రీ వర్గాలు ఎప్పటినుంచో అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీఐ పేమెంట్లు పెద్ద మొత్తంలో చేసే పెద్ద వ్యాపారుల నుంచి మాత్రమే మర్చంట్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతానికి యూపీఐ యూజర్లపై ఛార్జీలు విధిస్తున్నట్లు ఎలాంటి అధికారిక నిర్ణయం లేదు. ప్రతిపాదన ప్రకారం ఛార్జీలు ఉంటే అది కూడా పెద్ద మర్చంట్లకే వర్తించే ఛాన్స్ ఉంది. యూపీఐ వాడే ప్రతి ఒక్కరూ ఇక నుంచి ఛార్జీలు చెల్లించాలి అనే ప్రచారంలో వాస్తవం లేదని గమనించాలి.